ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
x
Highlights

జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి నేరుగా ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అలాగే, ఇంటి సభ్యలు,...

జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి నేరుగా ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అలాగే, ఇంటి సభ్యలు, చుట్టుపక్కన ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లాల్లోని కోదాడలో చోటుచేసుకుంది. లీలాదరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు రాజస్థాన్ నుంచి విశాఖపట్నం వెళ్తొందిది. ఈ క్రమంలోనే ఈరోజు తెల్ల‌వారుజామున ట్రావెల్స్ బస్సులు సూర్యాపేటకు చేరుకుంది.

అలా చేరుకన్న బస్సులు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే ఆ మరుక్షణం బస్సు రోడ్డు వెంబ‌డి ఉన్న ఇంట్లోకి రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories