Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 11:25 AM IST
Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
X

Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారిలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల్లో 9ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. చండ్రుగొండ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అయితే.. డివైడర్‌ స్టార్టింగ్‌ పాయింట్‌ దగ్గర ఎలాంటి సూచిక లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story