Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డితో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భేటీ

Telangana Congress: పీసీసీ అయ్యాక మొదటిసారి ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి

Rama Rao
Published on: 15 Feb 2022 1:14 PM IST
TPCC Chief Revanth Reddy Meets MP Komatireddy Venkat Reddy
X

 ఎంపీ కోమటిరెడ్డితో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భేటీ

Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ అయ్యాక మొదటిసారి ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఇటీవల ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో కోమటిరెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలపై ఎంపీ కోమటిరెడ్డితో రేవంత్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఇక జనగామ సభలో కేసీఆర్‌కు అనుకూలంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడారు. 2 రోజుల క్రితం కోమటిరెడ్డిపై పీసీసీకి పలువురు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story