PM Modi: జులై 8న వరంగ్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని మోడీ

The Prime Minister Will Visit Goddess Bhadrakali In Warangal On July 8
x

PM Modi: జులై 8న వరంగ్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని 

Highlights

PM Modi: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ, టైక్ట్స్‌టైల్స్ పార్కుకు శంకుస్థాపన

Kishan Reddy: ప్రధాని మోడీకి స్వాగతం చెప్పడానికి వరంగల్ ప్రజలు ఎదురుచూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాగా ప్రధాని మోడీ జులై 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి, టెక్స్ట్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో హన్మకొండలో బీజేపీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈటల రాజేందర్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. వరంగల్‌కు చేరుకుని ప్రధాని మోడీ మొదటగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, జాతీయ రహదారుల భూమి పూజల్లో ప్రధాని పాల్గొంటారని కిషన్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories