మర్డర్ చేసి సెల్ఫీ దిగాడు

Arun Chilukuri
Updated on: 9 March 2020 6:15 PM IST
మర్డర్ చేసి సెల్ఫీ దిగాడు
X
పిచ్చి పీక్స్ కి..సెల్ఫీ మర్డర్..

కొందరికి సెల్ఫీ పిచ్చి ముదురుతోంది. అందమైన ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం సాధారణం. కానీ ఇక్కడ మర్డర్‌ చేసిన నిందితుడు మృతదేహం వద్ద సెల్ఫీ దిగాడు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఈ నెల 6వ తేదీన ఏఎస్సై శివరాజ్‌ను ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. అందులో వివేక్‌ అనే వ్యక్తి శివరాజ్‌ను చంపి సెల్ఫీ తీసుకున్నాడు. ఫోటోను స్టేటస్‌ కూడా పెట్టుకున్నాడు. దీనిపై మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నిందితులను అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story