జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత

* రైతుల సమావేశానికి బయల్దేరిన..బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్‌ నేతలు * కేంద్రం ఇచ్చే నిధులు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శన *టీఆర్ఎస్‌ కార్యకర్తలు అరెస్టు

admin
Published on: 25 Dec 2020 12:38 PM IST
జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత
X

జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నూతన సాగు చట్టాలపై రైతుల అవగాహాన సదస్సుకు బయల్దేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌ అడ్డుకున్నారు. అటు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు ఇవ్వాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ఉద్రిక్తతల నడుమ టీఆర్ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

admin

admin

Next Story