రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

Tension at Shadnagar Toll Plaza in Ranga Reddy District
x

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

Highlights

Ranga Reddy: సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్‌, టోల్‌ సిబ్బందికి మధ్య గొడవ

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్‌ చెల్లింపు విషయంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్‌, టోల్‌ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ప్రణీల్‌ అనుచరులు.. టోల్‌ బూత్‌ అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో టోల్‌ సిబ్బందితో పాటు.. ప్రణీల్‌ అనుచరులు కూడా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలైనవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories