క్లైమాక్స్ కు చేరుకున్నటీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ

క్లైమాక్స్ కు చేరుకున్నటీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ
x
Highlights

* ఈనెల 24న ఢిల్లీకి ముగ్గురు ముఖ్య నేతలు * ఢిల్లీ వెళ్లనున్న కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి..? * అదేరోజు కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటించే ఛాన్స్‌

తెలంగాణకు కాబోయే పీసీసీ చీఫ్ ఎవరనే సస్పెన్స్ కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ చివరిదశకు చేరుకోగా... ఈనెల 24న రేసులో ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీపీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు ఖరారయ్యిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

రేపు సాయంత్రం తెలంగాణ నుంచి వెళ్లే ముగ్గురు ముఖ్య నేతల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ చేసిన ఏఐసీసీ..... ఇందులో అధిక మద్దతు ఉన్న వారికే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories