TS POLYCET 2021: నేడు తెలంగాణ పాలిసెట్ పరీక్ష
TS POLYCET 2021: హజరు కానున్న 1.02 లక్షల మంది విద్యార్థులు * ఇంజినీరింగ్ కోసం 64,898
పాలిసెట్ పరీక్ష (ఫైల్ ఇమేజ్)
TS POLYCET 2021: ఇవాళ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ జరగనుంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు 2021 -22 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్, అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమో కోర్సులతో పాటు బాసర RGUKT లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్ పరీక్ష ఇవాళజరగనుంది. ఈసారి సుమారు 1.02 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేశారు. అందులో ఇంజినీరింగ్ కోసం 64వేల 989, అగ్రికల్చర్ కోసం 37వేల 598 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
Next Story




