Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్‌రావు కస్టడీ 25 వరకు పొడిగింపు

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్‌ దూకుడు పెంచింది.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 12:58 PM IST
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్‌రావు కస్టడీ 25 వరకు పొడిగింపు
X

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్‌ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును నేటి నుంచి మరోసారి విచారించనున్నారు సిట్ అధికారులు. ఇందులో భాగంగా.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ క్రైమ్ స్టేషన్‌లోనే సిట్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. సీసీఎస్‌ ఆఫీస్‌కు ప్రభాకర్‌రావును తరలించి.. అక్కడే విచారించనుంది సిట్ బృందం.

నిన్న సుప్రీంకోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విచారణ జరిగింది. కస్టడీ సమయంలో ప్రభాకర్‌ తమకు సహకరించలేదని, మరికొన్ని రోజులు విచారించాల్సి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. మరో వారం రోజులు కస్టడీకి అనుమతివ్వాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు.. ప్రభాకర్‌రావు కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story