Telangana Panchayat Elections 2025: తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు.. ప్రశాంతంగా ముగిసిన చివరి విడత పోలింగ్‌

Telangana Panchayat Elections 2025: తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

Arun Chilukuri
Published on: 17 Dec 2025 1:05 PM IST
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు.. ప్రశాంతంగా ముగిసిన చివరి విడత పోలింగ్‌
X

Telangana Panchayat Elections 2025: తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల వరకు 57.91 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్‌ పర్సంటేజీ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే.. కాసేపట్లో చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.

ఇక.. ఇవాళ జరిగిన చివరి విడతలో మొత్తం 182 మండలాల్లోని 3వేల 752 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ సర్పంచ్‌ ఎన్నికల్లో 12వేల 640 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే.. మొత్తం 28 వేల 406 వార్డులకు ఎన్నికలు జరగగా.. 75వేల 283 మంది బరిలో నిలిచారు. ఇక.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి.. కాసేపట్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీంతో గెలుపోటములపై అటు అభ్యర్థుల్లోనూ.. ఇటు పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story