ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తి

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తి
x

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తి

Highlights

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులు...

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఇండిపెండెట్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. నిన్న అఫిడవిట్‌ సరిగ్గా లేనందున టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మళ్లీ నామినేషన్‌ వేశారు.

తెలంగాణలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాళ ముగిసింది. మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 60 మందికిపైగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 26న విత్ డ్రాకు గడువుగా నిర్ణయించారు. మార్చి14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి17న ఓట్ల లెక్కిస్తారు.

హైదరాబాద్-రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి బరిలో ఉండగా., బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీలో నిలిచారు. నిన్న అఫిడవిట్‌ సరిగ్గా లేనందున టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఇవాళ నామినేషన్‌ వేశారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి పోటీపడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్షాలు రెండు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రచార హోరును ప్రారంభించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories