గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

Arun Chilukuri
Published on: 19 Nov 2025 1:24 PM IST
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్
X

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో స్థానిక కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సాండ్ బజార్‌ను ప్రారంభించారు మంత్రి వివేక్‎. గోదావరి ఇసుక కోసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సాండ్ బజార్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఈ సాండ్ బజార్ TGMDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, గోదావరి ఇసుక కావలసిన ప్రజలు ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వస్తోందని అన్నారు. చెన్నూరు‎లో గోదావరి నది ఉన్న ఇసుక దొరకని పరిస్థితి ఉండడంతో అధికారులతో మాట్లాడి ఈ సాండ్ బజార్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story