IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్!

IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మేనేజింగ్ డైరెక్టర్గా జ్యోతి బుద్ధప్రకాశ్ను నియమించడం గమనార్హం.
మరికొన్ని కీలక మార్పులు ఇవే:
సవ్యసాచి ఘోష్: ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్ బాధ్యతల్లోనూ కొనసాగనున్నారు.
దివ్య: పంచాయతీరాజ్ కమిషనర్గా ఈమెకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
సందీప్కుమార్ సుల్తానియా: ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
కాత్యాయనీ దేవి: ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. దీనితో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
మయాంక్ మిట్టల్: హైదరాబాద్ జలమండలి (HMWSSB) జేఎండీగా నియమితులయ్యారు.
రఘురామ్ శర్మ: పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీగా కూడా తన బాధ్యతలను కొనసాగిస్తారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



