కరోనాపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court Key Orders To Govt Over Coronavirus Outbreak
x

కరోనాపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

Highlights

High Court: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

High Court: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రూలింగ్ పార్టీతో సహా అన్ని పార్టీలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెస్టులు కూడా పెంచాలని వైద్యశాఖకు సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని తెలిపింది.

తెలంగాణలో అధికార పార్టీ కరోనా నిబంధనలు పాటించకుండా రైతు బంధు సంబరాలు నిర్వహించారని హైకోర్టులో దాఖలైన పిల్ పై చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. టీఆర్‌ఎస్‌ పార్టీ కరోనా నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమాలు పెట్టినా వారికి అనుమతించడం లేదంటూ హైకోర్టుకు తెలిపారు పిటీషనర్లు. అలాగే కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

పిటిషన్ పై విచారణ చేసిన చీఫ్ జస్టిస్ డివిజనల్ బెంచ్ రూలింగ్ పార్టీతో పాటు అన్ని పార్టీలు కరోనా గైడ్‌లైన్స్ పాటించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నందున టెస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ వైరస్ చిన్న పిల్లల్లో కూడా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రస్తుతమున్న నీలోఫర్ హాస్పిటల్‌తో పాటు అదనంగా కొన్ని హాస్పిటల్స్‌ని పెంచాలని సూచించింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21,28 తేదీల్లో జారీ చేసిన గైడ్‌లైన్స్‌ని రాష్ట్రం తప్పకుండా పాటించాలంది హైకోర్టు. సినిమా ధియేటర్స్, మాల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లతో పాటు ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్‌లో నియమ నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. వీకెండ్స్ లో జరిగే సంతలతో పాటు క్రౌడ్ ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్లేసెస్ లో కోవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్, ఒమిక్రాన్ పరిస్థితులపై రిపోర్ట్ తయారు చేసి ఈ నెల 17 లోపు హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్ట్. కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై తదుపరి విచారణ ఈనెల 17కి వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories