Etela Rajender Video Conference with Hospital Superintendent: గాంధీ ఆసుపత్రి నర్సులు పేషెంట్లకు అన్నం తినిపిస్తున్నారు

Etela Rajender Video Conference with Hospital Superintendent: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Sumitra
Published on: 6 July 2020 5:45 PM IST
Etela Rajender Video Conference with Hospital Superintendent: గాంధీ ఆసుపత్రి నర్సులు పేషెంట్లకు అన్నం తినిపిస్తున్నారు
X
Etela Rajender (File Photo)

Etela Rajender Video Conference with Hospital Superintendent: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అవసరాలు, సమస్యలపై చర్చించారు. జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో - తక్కువ లక్షణాలున్న వారందరికీ చికిత్స అందించాలని సూచించారు. కరోనా పాజిటివ్గ గా నిర్ధారణ అయి లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐశొలేషన్ లో ఉంచాలి అని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఏ కొరత ఉండకుండా చూడాలని.

వైద్యానికి అవసరమయ్యే ఏ పరికరాలు కోరినా అది ఒక్క రోజులో అందిస్తామని హామీ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని తెలిపారు. అలాంటి మానవత్వం ఇప్పుడు అవసరమని అన్నారు. ఈ సేవ మీకు పుణ్యం అందిస్తుందన్నారు. మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి క్వార్టర్స్ లోనే ఉండి అందుబాటులో ఉంటున్నందుకు ఆయన్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అన్నీ జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు కూడా జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, కోవిడ్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్, గాంధీ ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ రాజారావు ఉన్నారు.

Sumitra

Sumitra

Next Story