Telangana Gram Panchayats: తెలంగాణ గ్రామాలకు కేంద్రం శుభవార్త.. రూ. 387 కోట్ల నిధులు విడుదల!

Telangana Gram Panchayats: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిధులను విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 12 Feb 2026 1:32 PM IST
Telangana Gram Panchayats: తెలంగాణ గ్రామాలకు కేంద్రం శుభవార్త.. రూ. 387 కోట్ల నిధులు విడుదల!
X

Telangana Gram Panchayats: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) గ్రాంట్ల కింద తాజా విడతగా రూ. 387 కోట్లను మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం, కేంద్రం కోరిన అన్ని సాంకేతిక వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సమర్పించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం విడతలవారీగా నిధులను విడుదల చేస్తోంది:

మొదటి విడత: రూ. 259.36 కోట్లు

తాజా విడత: రూ. 387.00 కోట్లు

మొత్తం విడుదలైన నిధులు: రూ. 646.36 కోట్లు

15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రావాల్సిన మొత్తం నిధుల్లో ఇప్పటికీ సుమారు రూ. 2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మొత్తం రూ. 3,000 కోట్లకు పైగా నిధులు అందాల్సి ఉండగా, కేంద్రం నిబంధనల ప్రకారం దశలవారీగా వీటిని కేటాయిస్తోంది.

గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కేంద్రం కోరిన నిబంధనలన్నీ రాష్ట్రం అమలు చేసిందని, సకాలంలో నిధులు అందితేనే గ్రామాల రూపురేఖలు మార్చడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story