Midday Meal : విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

Arun Chilukuri
Published on: 17 July 2020 5:51 PM IST
Midday Meal : విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
X

midday meal: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని కేసీఆర్‌ అన్నారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. కాగా, జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story