Rythu Bandhu: ఈ నెల 28 నుంచి రైతుబంధు.. రైతుల ఖాతాల్లో నగదు జమ...

Telangana Government Release of Rythu Bandhu Scheme 28.12.2021 | Telangana News Online
x

ఈ నెల 28 నుంచి రైతుబంధు

Highlights

Rythu Bandhu: రైతుల ఖాతాల్లో నగదు జమ.. గతంతో పోలిస్తే పెరిగిన లబ్దిదారుల సంఖ్య

Rythu Bandhu: పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు ఈ నెల 28 నుంచి రైతులకు అందనుంది. సీఎం కెసిఆర్ ఆదేశాలతో మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి రైతుబంధు సాయంతో పాటు లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో 61 లక్షల మందికి.. 7 వేల 377 కోట్లు సాయంగా అందించారు. యాసంగిలో లబ్దిదారుల సంఖ్య అరవై ఆరున్నర లక్షలకు చేరుకోగా 7వేల 600 కోట్లను ఖర్చు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories