స్కూళ్ల రీ-ఓపెన్‌పై క్లారిటీకి వచ్చిన తెలంగాణ సర్కార్

స్కూళ్ల రీ-ఓపెన్‌పై క్లారిటీకి వచ్చిన తెలంగాణ సర్కార్
x
Highlights

* ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్కూళ్లు తెరవద్దని భావిస్తున్న ప్రభుత్వం * స్కూళ్లు తెరిచినా తల్లిదండ్రులు పంపించే అవకాశంలేదు * పిల్లలు భౌతిక దూరం పాటించడం కష్టమే.. * 9-10 తరగతులకు మాత్రం కనీసం 90 రోజులు విద్యాబోధన అందించాలని యోచన

లాక్‌ డౌన్ తర్వాత అన్ని ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాయి. కానీ విద్యాసంస్థల విషయంలో గందరగోళం మాత్రం విడడం లేదు. అసలు స్కూళ్లు ఉంటాయా.. ఉండవా అని తెలియక తల్లిదండ్రులు అయోమయోంలో ఉన్నారు. అయితే స్కూళ్లు తెరిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలు తెరిచినా పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి 5 తరగతులకు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

స్కూళ్లను ప్రారంభిస్తే.. పిల్లలు సోషల్‌ డిస్టెన్స్ పాటించడం అసాధ్యం. పిల్లలు వైరస్ బారినపడితే సమస్య తీవ్రతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఐదో తరగతి వరకు బడులు ప్రారంభించకపోవడమే మంచిదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకోనున్నారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories