తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన
x
Highlights

భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ...

భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని అధికారుల బృందం తొలిరోజు హైదరాబాద్ పాతబస్తీలోని పలు కాలనీల్లో వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించింది. వరదల వల్ల కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి వివరించింది. ఇవాళ కూడా వర్షబీభత్స ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటించి నష్టం అంచనా వేయనుంది.

భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. దిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, పోలీస్​, జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బృందానికి వరదలతో జరిగిన నష్టాన్ని వివరించారు.

రాష్ట్రంలో దాదాపు 8 వేల 633 కోట్ల మేర పంటనష్టం, 222 కోట్ల మేర రహదారులకు నష్టం సహా జీహెచ్​ఎంసీలో పరిధిలో 567 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వరదలపై నష్టానికి సంబంధించి ఛాయాచిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో వరదతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా వద్ద దెబ్బతిన్న రైల్వే వంతెన ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు రఘురామ్, ఎస్కే కుష్వారా ఆర్వోబీ పునరుద్ధరణ పనులు నాలాపూడికతీత తొలగింపును పరిశీలించారు. వరద ఉద్ధృతికి కట్టలు తెగిన గుర్రం చెరువు, పల్లె చెరువు పరిస్థితిని ఆరా తీశారు. చివరగా అప్పచెరువును పరిశీలించిన కేంద్ర అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలని సూచించారు. మరమ్మతు పనులు, గండి పడటంతో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

సిద్దిపేట జిల్లాలో మరో బృందం సభ్యులు పర్యటించారు. ములుగు, మార్కుక్​ మండలాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇవాళ కూడా రాష్ర్టంలో వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టంపై నివేదిక రూపొందించి కేంద్రానికి అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories