Telangana: తెలంగాణాలో పలు జిల్లాలోని వార్తలు

Telangana District Wise Breaking news
x

తెలంగాణా తాజా వార్తలు 

Highlights

Telangana: తెలంగాణలోని పలు జిల్లాల వారిగా తాజా వార్తలు

Telangana:

మాజీమంత్రి విజయరామారావు నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యన్నం శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీమంత్రులు ఏ.చంద్రశేఖర్, రవీంద్ర నాయక్, కపిలవాయి, దిలీప్ కుమార్‌లు హాజరయ్యారు. వివిధ అంశాలపై మేధోమథనం జరిపిన ఉద్యమకారులు.. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా:

జోగుళాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ సీఎం ఓఎస్డీ స్మిత సబర్వాల్ పర్యటించారు. ఇటిక్యాల మండలం కోదండపూర్‌ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రకృతి వనాన్ని పరిశీలించిన స్మిత సబర్వాల్ ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆ తర్వాత గ్రామసభలో పాల్గొని గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా:

నిజామాబాద్ జిల్లా బోధన్‌ మండలం బార్డిపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు వాగులో గల్లంతయ్యాడు. పొలం పనులకు వెళ్తూ వాగు దాటేందుకు ప్రయత్నించగా.. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

మేడారం:

మంత్రి సత్యవతి రాథోడ్‌ మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి సాంప్రదాయం ప్రకారం అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్న మంత్రి... ఆ తర్వాత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఫిల్టర్ బెడ్ పనులకు శంకుస్థాపన చేశారు. దసరా లోపు పనులు పూర్తవుతాయని.. ధర్మపురికి మిషన్ భగీరథతో పాటు ఫిల్టర్ బెడ్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత టిటిడి కల్యాణ మంటపంలో దళిత సాధికారత పథకం కృతజ్ఞత అభినందన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి కొప్పుల. ఈ కార్యక్రమంలో మంత్రిని సన్మానించారు దళితనాయకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories