Revanth Reddy: స్విగ్గీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల సాయం

Telangana Chief Minister Revanth Reddy Has Given Rs 2 Lakhs To Swiggy Boy Family
x

Revanth Reddy: స్విగ్గీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల సాయం 

Highlights

Revanth Reddy: ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గి డెలివరీ

Revanth Reddy: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి 2లక్షల ఆర్థిక సాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి 2లక్షల చెక్‌‌ను సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్‌తో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తాజాగా బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి, ఆ కుటుంబానికి 2లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories