Telangana Budget 2021: ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం

Telangana Assembly Sessions to Continue till March 26
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Telangana Budget 2021: అసెంబ్లీ ప్రాంగ‌ణంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశం ముగిసింది.

Telangana Budget 2021: అసెంబ్లీ ప్రాంగ‌ణంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశానికి శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుతో పాటు ఆయా పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈనెల 26వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 18న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండగా రేపు సభలో సంతాప తీర్మానం పెట్టనున్నారు. 17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 20న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. అదేవిధంగా ఈనెల 26న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories