వారి వల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు : మాణికం ఠాగూర్

Arun Chilukuri
Published on: 14 Dec 2020 3:45 PM IST
వారి వల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు : మాణికం ఠాగూర్
X

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామన్నారు మాణికం ఠాగూర్. 13 కేటగిరీల్లో 162 మంది నేతల అభిప్రాయాలు సేకరించామని తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి మరికొంతకాలం సంప్రదింపులు సాగనున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అందరి ఆమోదం మేరకు కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ప్రజల్లో బలం లేని కాంగ్రెస్‌ నేతలే పార్టీని వీడుతున్నారన్న మాణికం ఠాగూర్ వారి వల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఢిల్లీలో దోస్తీ ... గల్లీలో కుస్తీ అన్న చందంగా బీజేపీ-టీఆర్ఎస్‌ స్నేహం ఉందంటూ విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story