డాక్టర్ టు గవర్నర్

డాక్టర్ టు గవర్నర్
x
Highlights

తెలంగాణకు తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. వైద్యురాలిగా పని చేసిన ఆమె బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై బీజీపీలో చేరారు. ...

తెలంగాణకు తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. వైద్యురాలిగా పని చేసిన ఆమె బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై బీజీపీలో చేరారు. బీజేపీలో క్రీయాశీల కార్యకర్త నుంచి జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేశారు తమిళిసై.

తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. వైద్య వృత్తి నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై సౌందరరాజన్ కొద్దికాలంలోనే బీజేపీలో అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో జూన్ 2 1961న జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమారీ ఆనందన్ పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. తమిళిసై భర్త సౌందరరాజన్ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు. భారత వైద్య పరిశోధనా మండలిలో పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.

తమిళిసై మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో గైనకాలజీలో పీజీ చేశారు. అనంతరం కెనడాలో సోనోలజీ, ఎఫ్ఈటీ థెరిపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి ముందు ఆమె రామచంద్రన్ వైద్యకళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు.

తండ్రి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉండడంతో చిన్నతనం నుంచి తమిళిసై రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. తండ్రి కాంగ్రెస్‌లో ఉన్నా తాను మాత్రం బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి అనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు.

1999లో సౌత్ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా పని చేశారు తమిళిసై. 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధానకార్యదర్శిగా , 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ గా, 2007లో పార్టీ ప్రధానకార్యదర్శిగా , 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు తమిళిసై. బీజేపీ రాష్ట్రఅధ్యక్షురాలిగా పని చేస్తున్న ఆమెను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా నియమించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories