Talasani Srinivas Yadav: కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది

Talasani Srinivas Yadav: కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
x

Talasani Srinivas Yadav: కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది

Highlights

Talasani Srinivas Yadav: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Talasani Srinivas Yadav: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు అరాచకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు భయపడి నిర్మల్ జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. నల్గొండలో ఒక సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి, దారుణంగా కొడతారా? అని ప్రశ్నిస్తూ ఆయన కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగకుండా, అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దౌర్జన్యాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories