Schools Reopen: తెలంగాణలో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉత్కంఠ
Schools Reopen: హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కొనసాగుతున్న సందిగ్ధత
తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ పై కొనసాగుతున్న ఉత్కంట(ఫైల్ ఇమేజ్)
Schools Reopen: తెలంగాణలో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉత్కంఠ కొనసాగుతుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సందిగ్ధత నెలకొంది. దీంతో రేపు బడులు ప్రారంభిస్తారా..? లేదా వాయిదా వేస్తారా..? అనే అంశంపై పిల్లల తల్లిదండ్రులు చర్చలు చేస్తున్నారు. అటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కోసం విద్యాశాఖ వేచిచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రత్యేక్ష బోధనకు హాజరు కావాలంటూ విద్యార్థులను బలవంత పెట్టొదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ మెమో సవరించనుంది. మొత్తానికి రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభంపై మరికాసేపట్లో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
Next Story




