బ్రేకింగ్: తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అనూహ్య మలుపు!

బ్రేకింగ్: తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అనూహ్య మలుపు!
x
Highlights

Supreme Court: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక విచారణ జరిపింది.

Supreme Court: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక విచారణ జరిపింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుండటంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు నిర్ణీత గడువులోగా నిర్ణయాలు తీసుకోవాలని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన పిటిషన్లను నిర్ణీత సమయంలోగా ఎందుకు పరిష్కరించలేదో తెలపాలని ఆదేశించింది.

బీఆర్‌ఎస్‌ తరఫున పాడి కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు వంటి వారు పార్టీ మారినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories