Warangal: 15 ఏళ్లనాటి బోరు నుంచి.. దానంతట అదే పైకి ఉబికి వస్తున్న నీరు

Warangal: వరంగల్ జిల్లా కట్ర్యాలలో వింత ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోంచి నీరు పైకి ఊబికి వచ్చింది.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 11:42 AM IST
Warangal: 15 ఏళ్లనాటి బోరు నుంచి.. దానంతట అదే పైకి ఉబికి వస్తున్న నీరు
X

Warangal: 15 ఏళ్లనాటి బోరు నుంచి.. దానంతట అదే పైకి ఉబికి వస్తున్న నీరు

Warangal: వరంగల్ జిల్లా కట్ర్యాలలో వింత ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోంచి నీరు పైకి ఊబికి వచ్చింది. వాడని బోరులోంచి నీరు రావడం చూసి స్థానిక రైతులు ఆశ్చర్యపోతున్నారు. తనకున్న ఎకరం పొలంలో 200 అడుగులతో 15 సంవత్సరాల క్రితం బోరు వేయగా నీటి చుక్క కూడా రాలేదని తెలిపాడు రైతు. ఇన్నేళ్లకు వాడని బోరు నుంచి మళ్లీ నీరు రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ లేకుండానే నిర్విరామంగా వస్తున్న నీటిని తన పంట సాగుకు వినియోగిస్తున్నట్లు రైతు కిరణ్ తెలిపాడు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story