Steel Plant: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

V Hanumantha Rao Fires On Narendra Modi
x

ఇమేజ్ ( ది హన్స్ ఇండియా )

Highlights

ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Steel Plant: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాని, అంబానీల చేతిలో మోడీ కీలు బొమ్మగా మారారని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రేపు బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ కూడా అమ్మేస్తారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా ఉండాలంటే మరో స్వాతంత్ర్య పోరాటంలాగా ఉద్యమించాలని వీహెచ్ పిలుపునిచ్చారు. మోదీ రిమోట్ కంట్రోల్.. ఆదానీ, అంబానీ చేతిలో ఉందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోకపోతే.. ప్రజలు క్షమించరని తెలిపారు. కాంగ్రెస్ పెద్ద ఉద్యమం చేయాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవని వీహెచ్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories