రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు

రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు
x
Sabitha Indra Reddy
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయి ఏప్రిల్ 6వ తేదీన ముగియనున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయి ఏప్రిల్ 6వ తేదీన ముగియనున్నాయి.ఈ నేపథ్యంలోనే మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు కాపీ కొట్టకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని ఆమె అన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమవుతాయని, విద్యార్థులు 8.30 గంటల వరకు పరీక్షకేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.

ప్రస్తుతం ఎండ తీవ్రత పెరిగిపోతుందని ఇందుకు గాను ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యసిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు అందించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతామని తెలిపారు. పరీక్షల సమయంలో ఎవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించడానికి కంట్రోల్‌రూం (040-23230942)ను డీఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేసామని తెలిపారు. ఇప్పటి వరకు హాల్ టికెట్లు అందని విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు చదువుకోవడానికి, పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి అన్ని వసతులు కల్పించాలని అధికారులకు తెలిపారు.

ఇక పోతే రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. పరీక్షకేంద్రాల్లో ఉదయం 8.30 నుంచే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేసారు. ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే మరొకరిని నియమిస్తామన్నారు. విద్యార్థులు వాటర్ బాటిల్లు, మాస్కులు ధరించినా అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుగుకోవడానికి పరీక్ష కేంద్రంలో లిక్విడ్, శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి, అదనపు డైరెక్టర్‌ రమణకుమార్‌, శ్రీహరి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories