కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అక్కడికక్కడే మృతి..

Six Killed in Road Accident in Kamareddy
x

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అక్కడికక్కడే మృతి..

Highlights

Road Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ‎ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతుల సంఖ‌్య పెరిగే అవకాశం ఉంది. మద్నూర్ మండలం మోనూర్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటైనర్‌ లారీ హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వెళ్తోంది. ఆటో మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పిన ఆటో.. ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీ కిందకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా కంటైనర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories