సీబీఐని ఆశ్రయించిన శేజల్.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు

Shejal Approaches CBI Against MLA Durgam Chinnaiah
x

సీబీఐని ఆశ్రయించిన శేజల్.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు

Highlights

Shejal: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ సీబీఐని ఆశ్రయించారు.

Shejal: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ సీబీఐని ఆశ్రయించారు. ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేసిన ఆమె సమగ్ర విచారణ జరపాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కొద్ది రోజుల క్రితం అరిజిన్​డెయిరీ నిర్వాహకురాలు శేజల్ ఢిల్లీకి వెళ్లారు. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్​ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారు. తనపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ నెల రెండో తేదీన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో శేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ శేజల్ ఆరోపణలు చేశారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని బెయిల్‌పై బయటకు వచ్చినా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories