సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల

Sharmila  who was a fierce critic on CM KCR
x

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల

Highlights

Sharmila: *ఖమ్మం జిల్లా కల్లూరులో వైఎస్సారి టీపీ సభ

Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో వైఎస్సార్ టీపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల పాల్గొని ప్రసంగించ టీఆర్ఎస్ పడిపోతున్న ప్రతి సారి ఉద్యమాన్ని కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు. ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడితే కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు దక్కాయన్నారు. అన్ని వర్గాల వారాని సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు.

ఖమ్మం జిల్లా కల్లూరు లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యం లో భారీ భాహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ ప్రజలందరికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుపున శుభాకంక్షలు తెలిపారు.వందల మంది ఆత్మబలిదానాల తో తెలంగాణ వచ్చింది అన్నారు.ఉద్యమకారుడు అని కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే బంగారు తెలంగాణ అయ్యిందా అని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ పార్టీ పడిపోతున్న ప్రతిసారీ ఉద్యమాన్ని కేసీఆర్ వాడుకున్నారు అని సెంటిమెంట్ వాడి రెండవసారి కేసీఆర్ అధికారం లోకి వచ్చారు అని అన్నారు.అత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడితే కేసీఆర్ కుటుంబం లో 5 పదవులు వచ్చాయి అన్నారు.గెడ్డలు పెంచుకుని దీక్ష చేసినట్టు కేసీఆర్ నాటకం ఆడారు అని కవిత కు పోటీ లేని టికెట్,అత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారి తల్లికి ఓడిపోయే టికెట్ ఇచ్చి మోసం చేశారని46 లక్షల మందికి వైఎస్ఆర్ ఇళ్ళు ఇచ్చారు మరి కేసీఆర్ 8 ఏళ్ల కాలం లో ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఇంట్లో ఉండే కుక్క కు ఇచ్చే గౌరవం తెలంగాణ ప్రజలకు ఇవ్వటం లేదు అని ప్రతి వర్గాల వారిని కేసీఆర్ మోసం చేశారు అని తెలిపారు.కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ వాది కాదు అని ప్రజలకు న్యాయం చేయటానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అని ప్రజలు ఆశీర్వదిస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు

Show Full Article
Print Article
Next Story
More Stories