Swarnalatha Bhavishya Vani: మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి..

Swarnalatha Bhavishya Vani: మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి..
Swarnalatha Bhavishya Vani: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Swarnalatha Bhavishya Vani: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వెల్లడిస్తూ భక్తులకు కీలక సందేశం ఇచ్చారు.
స్వర్ణలత తల్లి ప్రకటనలో — రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించే బాధ్యత తనదే అని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి ప్రభావం ఉంటుందని, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అలాగే, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని, పాడిపంటలు బాగా పండుతాయని భవిష్య వాణి చెప్పారు. భక్తులు ఎంతో సంతోషంగా పూజలు నిర్వహించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంలో తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.."బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు… కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. ఎవరి జీవితంలో వారు అనుభవించాల్సింది కాలం తీరినప్పుడు తప్పదు. నేనెప్పుడూ మీకోసం ఉన్నాను. ఎవరికైనా అపాయం వస్తే, అడ్డుకుంటాను." అని అన్నారు. ఈ ఉత్సవాల్లో స్వర్ణలత తల్లి భవిష్యవాణి భక్తుల్లో ఆసక్తి, భయం కలిగించింది. భవిష్యత్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి మరింత పెంచింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



