కరోనాతో ఎవరూ ఆందోళనకు గురి కావొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కరోనాతో ఎవరూ ఆందోళనకు గురి కావొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
x
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Highlights

Sabitha indra reddy On pressmeet : కరోనా వైరస్‌కు ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Sabitha indra reddy On pressmeet : కరోనా వైరస్‌కు ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆస్పత్రికి కన్సర్న్ సంస్థ అందించిన నూతన అంబులెన్స్‌ను సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన సభ్యులు కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం చేవెళ్ల ఆస్పత్రిలో 25 లక్షల విలువైన అంబులెన్స్, ఐసీయూ సెంటర్‌కు ఏడూ బెడ్లను ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్యారి గురించి ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. వీటితోపాటు కొండాపూర్, షాద్‌ నగర్ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇవ్వటంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. పాజిటివ్‌ వస్తే భయానికి గురి కావొద్దని, బాధితులు ధైర్యంగా ఎదురుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఒకే రకమైన వైద్యం అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు లక్షలు ఖర్చు చేయవద్దని, అమెరికా నుంచి గాంధీ ఆస్పత్రి వరకు ఓకే చికిత్సను వైద్యులు అందిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతొ నగరంలోని టిమ్స్ ఆస్పత్రితో పాటు జిల్లాలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కూడా కోవిడ్‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. చేవెళ్ల ఆస్పత్రి సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ సేవలు గొప్పవని తెలిపారు. సుమారు మూడు కోట్లతో వివిధ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లతో పాటు సౌకర్యాల కల్పనకు కన్సర్న్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలలో కోవిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతమందికి అయిన టెస్టులు చేయటానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవటానికి అను నిత్యం కృషి చేస్తుందని కొనియాడారు. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులు అయిన వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories