స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మంది విద్యార్థులకు గాయాలు.. మంత్రి కేటీఆర్ ఆరా..

RTC Bus Hit a School Bus in Rajanna Sircilla
x

స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మంది విద్యార్థులకు గాయాలు.. మంత్రి కేటీఆర్ ఆరా..

Highlights

Bus Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.

Bus Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులను తీసుకొని వెళ్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. స్కూల్ బస్సులోని 20 మంది విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని క్షతగాత్రులకు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.

మరోవైపు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద‌రాబాద్‌కు తరలించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories