హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రూ. 550 కోట్లు ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రూ. 550 కోట్లు ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్
x
Highlights

ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరంలో కురుసిన వర్షాలకు, భారీ వ‌ర‌ద‌ల‌కు హైదరాబాద్ మహానగరం అత‌లాకుత‌ల‌మైంది. కాగా అక్కడి ప్ర‌జ‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్...

ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరంలో కురుసిన వర్షాలకు, భారీ వ‌ర‌ద‌ల‌కు హైదరాబాద్ మహానగరం అత‌లాకుత‌ల‌మైంది. కాగా అక్కడి ప్ర‌జ‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచారు. వ‌ర‌ద నీటి ప్ర‌భావానికి గురైన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌తి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా నగరంలోని పేదప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సాయం మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే ప్రారంభిస్తామ‌ని ఆయన వెల్ల‌డించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలన్నారు.

వ‌ర‌ద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న వారు ఎంతో న‌ష్ట‌పోయార‌ని ఆవేదన వ్యక్తం చేసారు. ఇళ్ల‌లోకి నీళ్లు రావ‌డం వ‌ల్ల బియ్యం స‌హా ఇత‌ర ఆహార ప‌దార్థాలు త‌డిసిపోయాయ‌న్నారు. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జలు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యార‌న్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క పేద కుంటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అదే విధంగా భారీ వరదతో దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల మరమ్మత్తు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

గ‌డిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు. నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ వరదల కారణంగా ఎన్నో కష్టాల పాలయ్యారని తెలిపారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని సీఎం అన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామ‌ని సీఎం పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories