మంచిర్యాలలో ఘోర ప్రమాదం..

మంచిర్యాలలో ఘోర ప్రమాదం..
x
Highlights

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి హైవేపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ సహా మొత్తం ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది గాయపడ్డారు.

హైదరాబాద్ నుంచి ఊట్నూర్ కి వస్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా వస్తున్నాయి. ఆ వేగంతోనే రెండు వాహనాలు ఢీకొన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే బస్సు, లారీ రెండు బోల్తా పడిపోయాయి. టిప్పర్‌ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకోగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 108 వాహనాలకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. కాగా వీరిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories