ఉప్పల్‌లో లారీ బీభత్సం: ఒకరి మృతి

ఉప్పల్‌లో లారీ బీభత్సం: ఒకరి మృతి
x
Highlights

హైదరాబాద్ ఉప్పల్ లోని జెన్ ప్యాక్ వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ఆరున్నర గంటల సమయంలో అతివేగంతో వస్తున్న లారీ ముందున్న...

హైదరాబాద్ ఉప్పల్ లోని జెన్ ప్యాక్ వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ఆరున్నర గంటల సమయంలో అతివేగంతో వస్తున్న లారీ ముందున్న డీసీఎంను ఢీ కొట్టింది. డీసీఎం వెళ్లి హనుమాన్ టెంపుల్ ప్రహరి గోడను, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు లారీ వెనుకనున్న మినీ గూడ్స్ వాహనాన్ని తాకింది. దీంతో మినీ గూడ్స్ లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బంజారాహిల్స్‌కు చెందిన రాంచందర్‌(42)గా గుర్తించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories