‎సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident In Patancheru Sangareddy District
x

‎సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

Highlights

Patancheru:

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో రోడ్డుప్రమాదం జరిగింది. పోచారం సమీపంలోని ఓఆర్ ఆర్ పై గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సదా, ధర్మేంద్రగా గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వట్టినాగులపల్లిలోని ఓ గ్రానైట్ షాప్ నుంచి రాళ్లను లోడ్ చేసుకొని.. బొల్లారం వైపు ఓఆర్ ఆర్ పై వెళ్లుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, బాధితులంగా బీహార్ వాసులుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories