నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు..

నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు..
x
Highlights

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమ్మర్‌పల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమ్మర్‌పల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి రహదారిపై అతి వేగంతో వచ్చిన కారు అదుపు తప్పి చిన్నారులపైకి వేగంగా దూసుకెళ్లింది. చిన్నారులు, ఓ యువతి కమ్మర్‌పల్లి హైవేపై పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి, మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదంలో మరణించిన వారి వివరాలు చూస్తే.. శ్రీజ (22), ఆదిత్య (8) చనిపోయారు. లక్ష్మీ ఆదిత్య (10), దేవాన్ష్ (4) కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకునున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories