Revanth Reddy: ఈ నెల 5న రాంచీకి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ న్యాయ్‌యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం

Revanth Reddy will participate in the Rahul Gandhi Bharat Jodo Nyay Yatra
x

Revanth Reddy: ఈ నెల 5న రాంచీకి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ న్యాయ్‌యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం

Highlights

Revanth Reddy: న్యాయ్‌యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్‌యాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5న రాంచీకి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర మణిపుర్, పశ్చిమబెంగాల్, బిహార్ మీదుగా నేడు జార్ఖండ్‌లోకి ప్రవేశించింది. జనవరి 14న రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర ప్రారంభం అయింది.

మణిపుర్‌లో ప్రారంభమైన ఈ న్యాయ్ యాత్ర ముంబయిలో ముగియనుంది. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారు. యాత్ర ప్రారంభం రోజున రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు తెలంగాణ నేతలు రాహుల్ యాత్రలో పాల్గొనగా.... ఈ నెల 5న రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లి రాహుల్ వెంట యాత్రలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories