ట్రాన్స్ జెండర్లను నేరుగా చట్టసభలకు నామినేట్ చేయాలి : రేవంత్ రెడ్డి

ట్రాన్స్ జెండర్లను నేరుగా చట్టసభలకు నామినేట్ చేయాలి : రేవంత్ రెడ్డి
x
Highlights

ట్రాన్స్ జెండర్లు వీరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచంలో వీరు ఎక్కడికి వెళ్లినా ఒక్కటే సమస్య. ట్రాన్స్ జెండర్లు సమాజంలో ఎక్కడికి వెళ్లినా వారు...

ట్రాన్స్ జెండర్లు వీరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచంలో వీరు ఎక్కడికి వెళ్లినా ఒక్కటే సమస్య. ట్రాన్స్ జెండర్లు సమాజంలో ఎక్కడికి వెళ్లినా వారు ఇతరులతో పరిపూర్ణంగా కలవలేరు. వారు వేరే ఏ పనులను చేయలేరు. అసలు వారికి ఎవరూ కూడా పనులను ఇవ్వరు. దీంతో హిజ్రాలు ఇంకా సమాజ సరిహద్దుల్లోనే సంచరిస్తున్నారు. ఇది కాస్త బాధాకరమైన విషయమే. ఈ క్రమంలోనే కొన్ని డిమాండ్లు వెలికివచ్చాయి. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, ముఖ్యంగా చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్రాన్స్ జెండర్లకు మద్దతు పలికారు. ట్రాన్స్ జెండర్లను నేరుగా చట్టసభలకు పంపించాలంటూ తన మనసులో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు 'చేంజ్ డాట్ ఆర్గ్' (change.org) లో ప్రచార పిటిషన్ ప్రారంభించారు. 'చేంజ్ డాట్ ఆర్గ్' వెబ్ సైట్ లో ఈ పిటిషన్ కు మద్దతు పలకడం ద్వారా ట్రాన్స్ జెండర్లను చట్టసభలకు నేరుగా నామినేట్ చేయాలన్న డిమాండ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చు. దీనిపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఓ పిటిషన్ ప్రారంభిస్తున్నానని తెలిపారు. "కొన్ని లక్షల మంది ఉండే ట్రాన్స్ జెండర్ల సమాజాన్ని మనం గత 70 ఏళ్లుగా విస్మరిస్తూనే ఉన్నామన్నారు. ట్రాన్స్ జెండర్లను చట్టసభలకు నామినేట్ చేయాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉంటాను" అంటూ ట్వీట్ చేశారు. నేరుగా నామినేట్ చేయడం ద్వారా వారిని పార్లమెంటులోకి, అసెంబ్లీల్లోకి తీసుకురావడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories