Revanth Reddy: గోపతండాలో మిర్చిరైతుల సమస్యలను తెలుసుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: క్వింటాలుకు 22వేల గిట్టుబాటు ధర కల్పించాలని వినతి

Dhatripriya
Published on: 9 Feb 2023 2:23 PM IST
Revanth Reddy Knowing The Problems Of Mirchi Rythu
X

Revanth Reddy: గోపతండాలో మిర్చిరైతుల సమస్యలను తెలుసుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నాగారం సమీపంలోని గోప తండాలో మిర్చి రైతుల సమస్యలను రేవంత్ రెడ్డి అడిగితెలుసుకున్నారు. మిర్చిసాగులోని సమస్యలను రేవంత్ రెడ్డికి బానోత్ లక్ష్మీ వివరించారు. క్వింటాలుకు 22 వేల గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని విన్నవించుకున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story