డీజీపీ మహేందర్‌ రెడ్డిపై నిప్పులు చెరిగిన రేవంత్‌

Revanth Reddy Fires on DGP Mahender Reddy
x

డీజీపీ మహేందర్‌ రెడ్డిపై నిప్పులు చెరిగిన రేవంత్‌

Highlights

Revanth Reddy: తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.

Revanth Reddy: తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. ప్రభుత్వానికి బానిసల్లా డీజీపీ బతుకుతున్నారని వెంటనే పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై టీఆర్‌ఎస్ నేతలు పాశవిక దాడికి పాల్పడుతున్నా డీజీపీ చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను తరిమి తరిమి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై మాట్లాడేందుకు ఫోన్‌ చేస్తే మాట్లాడాటానికి డీజీపీకి ఇబ్బందేమిటి? ఒక ఎంపీగా, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఫోన్‌ చేస్తే డీజీపీ స్పందించరా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories