పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసిన రేవంత్ రెడ్డి..

పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసిన రేవంత్ రెడ్డి..
x
రేవంత్ రెడ్డి ఫైల్ ఫోటో
Highlights

మూడు నెలల క్రితం కేటీఆర్ ఫాంహౌస్ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ఆ కట్టడంపై రేవంత్ రెడ్డి డ్రోన్‌ను తిప్పించారు. అయితే కేటీఆర్ ఫాం హౌస్ పై అక్రమంగా...

మూడు నెలల క్రితం కేటీఆర్ ఫాంహౌస్ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ఆ కట్టడంపై రేవంత్ రెడ్డి డ్రోన్‌ను తిప్పించారు. అయితే కేటీఆర్ ఫాం హౌస్ పై అక్రమంగా డ్రోన్‌ను తిప్పారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ అరెస్టు విషయంలో ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, నార్సింగి ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులు 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసే ముందు కచ్చితంగా 41ఏ నోటీసు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు ఉల్లంఘించారని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

2020 మార్చి 1వ తేదీన ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి సలహా తీసుకున్న విజయ్‌పాల్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, వారి స్నేహితుడు విజయ్‌సింహారెడ్డి జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఆఫీస్‌కు వెల్లారు. అక్కడి నుంచి వారంతా డ్రోన్‌ కెమెరాతో ఫాం హౌస్ చిత్రీకరణ కోసం కోకాపేటకు వెళ్లి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. ఈ తరువాత జైపాల్‌రెడ్డి అక్కడే ఉండే ఓం ప్రకాశ్‌రెడ్డి అని యువకుడిని వారికి పరిచయం చేసారు.

వారందరూ డ్రోన్‌ కెమెరా సాయంతో అనుమనతులు లేకుండా వారు అనుకున్న ప్రాంతంతో పాటు చుట్టు పక్కన పరిసర ప్రాంతాలను కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని పూర్తి సమాచారాన్ని కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ సంఘటనపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారిపై 224/2020లో సెక్షన్‌ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్‌ విత్‌ 5ఏ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కింద అభియోగాలు మోపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories