GHMC కి తగ్గిన ఆదాయం

GHMC కి తగ్గిన ఆదాయం
x
Highlights

తెలంగాణలో ఎక్కువ ఆదాయం వచ్చే కార్పోరేషన్లలో మొదటి స్థానం జీహెచ్ఎమ్సీది. కానీ ఇప్పుడు బల్దియా ఆదాయం ఢమాల్ అయింది. వరసగా కరోనా, వరదలు, ధరణి, గ్రేటర్...

తెలంగాణలో ఎక్కువ ఆదాయం వచ్చే కార్పోరేషన్లలో మొదటి స్థానం జీహెచ్ఎమ్సీది. కానీ ఇప్పుడు బల్దియా ఆదాయం ఢమాల్ అయింది. వరసగా కరోనా, వరదలు, ధరణి, గ్రేటర్ ఎన్నికలతో ఆగమాగం అయింది.

ఈ ఏడాది బల్దియాకు ఇన్​కం తగ్గిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్​ కింద మొత్తం 1189.30 కోట్లు వచ్చింది. కరోనా కారణంగా బల్దియా ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం ఆస్తిపన్ను రాబట్టేందుకు ఎర్లిబర్డ్, వన్​ టైమ్ స్కీమ్​లను ప్రవేశపెట్టింది. అయితే వీటి ద్వారా గతేడాది వచ్చిన 1,472 కోట్ల కంటే ఎక్కువ వసూలును టార్గెట్​గా ​పెట్టుకుంది. అయితే వరదలు, ధరణి, ఎన్నికల కారణంగా అనుకున్నంత వసూలు కాలేదు. గత నెల 15 వరకు ఉన్న వన్​టైమ్ స్కీమ్​ కూడా నిలిచిపోయింది. ఇక కొత్త స్కీమ్ ​ఏదైనా తెస్తేనే ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. ఆరేళ్లుగా గ్రేటర్​ జనాలకు స్కీమ్​లు బాగా అలవాటు కావడంతో సాధారణ సమయంలో ఆస్తిపన్నులు చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. చెల్లించని వారు కూడా ఆఫర్​ ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు.

స్కీమ్స్​ ఉన్పప్పుడు ప్రతి నెలా వంద కోట్లకు పైగా ఇన్​కమ్​ బల్దియాకు వస్తుంది. సాదారణంగా ఒక్కోనెలలో అత్యధికంగా 200 కోట్ల వరకు ఉంటుంది. ఏప్రిల్​, మే ల్లో ప్రవేశపెట్టిన ఎర్లీబడ్​ స్కీమ్​ కింద 580 కోట్లు వసూలైంది. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్​ 15వరకు వన్​ టైమ్ స్కీమ్​ అమలు చేయడంతో మరో 280 కోట్లు వచ్చాయి. ఆస్తి పన్ను వసూలులో బిల్​ కలెక్టర్లదే కీలక పాత్ర ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్​ఎంసీలో 380 మంది ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన 1,189.30 కోట్లలో 509 కోట్లను వీరే వసూలు చేశారు. అయితే వీరు కరోనా డ్యూటీలు, ధరణి సర్వే, వరదలతో పాటు మొన్న జరిగిన గ్రేటర్​ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పనిచేశారు. దీంతో వారు పన్నుల వసూలుకు ఫీల్డ్​లోకి వెళ్లలేకపోవడంతోనూ ఇన్​కం పెరగలేదు. ఇక నవంబర్ 15 వరకు వన్​టైమ్ స్కీమ్ ​ఉన్నా 42 కోట్లు వసూలైతే ఈ నెల 17వరకు కేవలం 9 కోట్లు మాత్రమే వచ్చాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగి కొత్త బాడి వస్తున్న ఈ సమయంలో GHMC కి ఆదాయం తగ్గడం అనేది చాలా ఇబ్బందికర విషయం అని అందరి బావన.

Show Full Article
Print Article
Next Story
More Stories