Narendra Modi: రేపు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ

Prime Minister Narendra Modi Will Arrive in Hyderabad Tomorrow | TS News Today
x

రేపు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ

Highlights

Narendra Modi: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ

Narendra Modi: ప్రధాని మోడీ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరించనున్నారు మోడీ. ఈ సందర్భంగా ఎస్‌పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్‌పీజీ డీఐజీ నవనీత్‌కుమార్‌ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు.

సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్‌ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూం పనిచేయనుంది. ఎస్‌పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories